మళ్లీ కాంగ్రెస్ లోకి రాబోతున్నట్లు వస్తున్న వార్తలపై రాజగోపాల్ రెడ్డి క్లారిటీ

కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసి , బిజెపి లో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..తిరిగి కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ప్రచారం అవుతుంది. ఈ ప్రచారం చూసి అంత నిజమే కావొచ్చని భావిస్తున్నారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పుంజుకోవటంతో.. మళ్లీ ఆయన తిరిగి హస్తంతో దోస్తీ కడతారన్న ప్రచారం జరిగింది. వీటన్నింటికీ చెక్ పెడుతూ.. కోమటిరెడ్డి తన అభిమానులకు క్లారిటీ ఇచ్చేశారు.

కావాలనే..కొంతమంది తనపై తప్పుడు ప్రచారం చేసి.. తన అభిమానులకు ఆగం చేస్తున్నారంటూ రాజగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రచారాన్ని ఎవ్వరూ నమ్మొద్దని సూచించారు. వచ్చే ఎన్నికల్లోనూ తాను బీజేపీ తరపున మునుగోడు నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని తేల్చి చెప్పారు.