కడియంకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదంటూ మరో బాంబ్ పేల్చిన రాజయ్య

స్టేషన్ ఘనపూర్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య తీరు అందర్నీ అయోమయం చేస్తుంది. బిఆర్ఎస్ అభ్యర్థుల లిస్ట్ లో రాజయ్య పేరు లేకపోవడం అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తనను కాదని కడియం కు టికెట్ ఇవ్వడం ఫై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసాడు. ఒకానొక టైం లో పార్టీ మారే ఛాన్సులు కూడా ఉన్నట్లు వార్తలు వినిపించాయి. ఈ తరుణంలో కేటీఆర్ కడియం , రాజయ్యల ను పిలిపించి మాట్లాడి..వారిని ఒకటి చేసారు. కడియం కే నా మద్దతు అంటూ కేటీఆర్ సాక్షిగా రాజయ్య చెప్పుకొచ్చారు.

ఆ తర్వాత నిన్న కడియం కు సపోర్ట్ చేసేదేలేదు అంటూ మరో బాంబు పేల్చారు. కార్యకర్తలతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్‌ను కలవడానికి హైదరాబాద్ వెళ్లానని.. అక్కడ కడియం శ్రీహరి కూడా ఉండటంతో సన్నిహితంగా ఉండాల్సి వచ్చిందని తెలిపారు. అంతే తప్ప కడియంకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. వచ్చే ఎన్నికల్లో తనకే బీఫామ్ వస్తుందనే నమ్మకం ఉందన్నారు. నివేదికలు, సర్వేల ప్రకారం మున్ముందు మార్పులు ఉండవచ్చునన్నారు. ఒకవేళ బీఫామ్ రాకపోతే తన రాజకీయ భవిష్యత్ కాలమే నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. తాను జనవరి 17 వరకు ఎమ్మెల్యేగా ఉంటానని ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటానని వ్యాఖ్యానించారు.