తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

తెలంగాణ లో ముందస్తు ఎన్నికల అంశం ఇప్పుడు రాజకీయ పార్టీల్లో కలకలం రేపుతోంది. ఓ కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని చెపుతుంటే..ప్రతిపక్ష పార్టీలు మాత్రం కేసీఆర్ ముందస్తు ఎన్నికల్లో వ్యహంలో ఉన్నాడని అంటున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేసారు.

నిర్మల్ లో రాజగోపాల్ మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటకతో పాటే తెలంగాణలో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని అన్నారు. బిజెపి కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికార దుర్వినియోగంతోనే మునుగోడు ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ గెలిచిందని విమర్శించారు. తెలంగాణలో బిజెపికి పెరుగుతున్న ఆదరణతో కెసిఆర్ కి ఓటమి భయం పట్టుకుందని రాజగోపాల్ అన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదని, ఆ పార్టీలో బలమైన నాయకులే లేరన్నారు. కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీని వదిలేసి బిజెపిలోకి రావాలని పిలుపునిచ్చారు.