‘నాయకుడిగా నిన్నెవరూ గుర్తించడం లేదు. తెలుస్తోందా?’

లోకేష్ ను ఉద్దేశించి విజయసాయిరెడ్డి ట్వీట్

తెదేపా లో తాజా పరిణామాలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. ‘’బుచ్చయ్య రిజైన్ చేస్తారో లేదో గాని ఆయన చెప్పిన నిజాలు మాత్రం ఆసక్తికరంగా ఉన్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీడీపీలోకి లాక్కొని పొరపాటు చేశారని తప్పు బట్టానని చెప్పారు. అలా నిలదీసినందుకు బాబు తనతో రెండేళ్లు మాట్లాడలేదట. ప్రజలు బాబును ఐదేళ్లు తరిమారు. సూపర్ తీర్పు కదా!’’ అని విజయసాయి వ్యాఖ్యానించారు.

‘’ప్రజల మధ్యకు వెళ్లడం, పార్టీని బలోపేతం చేయడం అంటే శవ యాత్రలు కాదు మాలోకం. ఏ సమస్య లేని దగ్గర నలుగురిని వెంటేసుకుని అలజడి చేసి రాగానే పరిస్థితి మారదు. నువ్వు కాలు పెట్టిన చోటే సొంత పార్టీలో లుకలుకలు బయటపడుతున్నాయి.  నాయకుడిగా నిన్నెవరూ గుర్తించడం లేదు. తెలుస్తోందా?’’ అంటూ నారా లోకేష్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/