అనంతబాబుకు బెయిల్ మంజూరు..
హత్య కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న అనంతబాబుకు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. తల్లి చనిపోవడంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆయనకు మూడు రోజుల బెయిల్ ఇచ్చింది. నిన్న(ఆదివారం) అనంతబాబు తల్లి మంగారత్నం మృతిచెందిన సంగతి తెలిసిందే. తల్లి అంత్యక్రియలు నిర్వహించేందుకు అనంతబాబుకు ఈ నెల 25 సాయంత్రం వరకూ న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది.
తన మాజీ కార్ డ్రైవర్, దళిత యువకుడు సుబ్రమణ్యంను హత్య చేసినట్లు అనంతబాబు ఆరోపణలు ఎదురుకుంటున్నారు. కాగా ఈ కేసులో కాకినాడ పోలీసులు సమర్పించిన ఛార్జిషీటును అసంపూర్తిగా ఉందన్న కారణంతో ఆదివారం కోర్టు తిరస్కరించింది. మే 19న సుబ్రమణ్యం హత్యకు గురయ్యాడు. ఈ కేసులో ఎమ్మెల్సీ పాత్రపై మొదటి నుంచి అనుమానాలు వ్యక్తమయ్యాయి. కేసు పొలిటికల్ టర్న్ తీసుకుంది. ప్రతిపక్షాల ఒత్తిడి నేపథ్యంలో ప్రభుత్వంపై, పోలీసులపై ఒత్తిడి పెరిగింది. చివరకు శాసన మండలి చైర్మన్కు సమాచారం ఇచ్చి.. మే 23వ ఎమ్మెల్సీ అనంతబాబును తేదీన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా అనంతబాబును రిమాండ్లో ఉంచి.. శనివారానికి 90 రోజులు కంప్లీట్ అయ్యాయి. కాగా ఈ కేసు నత్తనడకన సాగుతుందని.. నిందితుడు తప్పించుకునేలా పోలీసులు సహకరిస్తున్నారని.. బాధిత కటుంబం ఆరోపిస్తుంది.