కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం..

మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు కాంగ్రెస్ శ్రేణుల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఏపీలో కాంగ్రెస్ ఓట్లు చీల్చితే వైసీపీకే లాభం జరగుతుందని , వైసీపీకి ప్రభుత్వ లబ్ధిదారుల ఓటు బ్యాంకు ఉందని తెలిపారు. అలాగే కేంద్రంలో మరోసారి బిజెపి రాబోతుందని జోస్యం చెప్పారు. 2029లో ఏం జరుగబోయేది ఇప్పుడే చెప్పలేమని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజగోపాల్ రెడ్డి కేంద్రంలో, ఏపీలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదని పరోక్షంగా చెప్పడం ఫై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పట్టులేని ఏపీ గురించి మాట్లాడితే పర్వాలేదు కానీ.. కేంద్రంలో ఇండియా కూటమి ఓటమి ఖాయమని ఆయన చెప్పిన పరోక్ష వ్యాఖ్యలు సరికాదని మండిపడుతున్నారు. ఒకవేళ అవకాశం లేకపోయినా కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందని చెప్పి కార్యకర్తల్లో జోష్ నింపాల్సింది పోయి.. బీజేపీ గెలుపు ఖాయమని సంకేతాలు ఇవ్వడం ఏంటి అని వారంతా వాపోతున్నారు.