త్వరలో రైల్వే కౌంటర్లలో టికెట్‌ బుకింగ్‌

రైల్వే టికెట్ల బుకింగ్ కౌంటర్లు రెండు, మూడు రోజుల్లో ఓపెన్ అవుతాయని కేంద్ర రైల్వే శాఖమంత్రి పీయూష్ గోయల్ వెల్లడి

piyush-goyal

న్యూఢిల్లీ: జూన్‌ 1 నుండి ప్రారంభం కానున్న రైల్వే సర్వీసుల కోసం ఈరోజు ఉదయం 10 నుండి ఆన్‌లైన్‌ రిజర్వేషనన ప్రారంభించిన విషయ తెలిసిందే. అయితే ఈనేపథ్యంలో రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే రైల్వే కౌంటర్లు తెరుస్తున్నామని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. టికెట్ల విక్రయాలు ఇకపై రైల్వే కౌంటర్ల ద్వారా కూడా జరపబోతున్నామని చెప్పారు. రైల్వే టికెట్ల బుకింగ్ దేశంలోని 1.7 లక్షల కేంద్రాల్లో జరుగుతుందని ప్రకటించారు. ఇప్పటి వరకు ఐఆర్‌సీటీసీ ద్వారా మాత్రమే రైల్వే టికెట్లు బుకింగ్ జరుగుతోంది. రైల్వే కౌంటర్లలో జరగడం లేదు. ఇకపై రైల్వే కౌంటర్లలో కూడా టికెట్లు ఇస్తామని చెప్పారు. అయితే, అందుకు కొన్ని మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్టు పీయూష్ గోయల్ ప్రకటించారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/