కరోనాపై చైనా తప్పుడు సమాచారం ఇస్తుంది
కరోనా విషయంలో చైనా చాలా తెలివితక్కువగా సమర్థించుకుంటోంది
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో చైనాపై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. కరోనా విషయంలో చైనా చాలా తెలివితక్కువగా తన దేశాన్ని సమర్థించుకుంటోందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులకు కారణమవుతున్న కరోనా గురించి తప్పుడు సమాచారం ఇస్తూ ప్రపంచాన్ని చైనా తప్పుదోవ పట్టిస్తోందని చెప్పారు. తమ దేశంతో పాటు ఐరోపా దేశాలపై చైనా చేస్తున్న తప్పుడు ప్రచారం అవమానకరంగా ఉందని ఆయన వాపోయారు. ఇతర దేశాలకు వైరస్ వ్యాపించకుండా సులభంగానే ఆపేసే అవకాశం చైనాకు ఉండేదని, కానీ వారు అలా చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/