నేడు తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన
![](https://www.vaartha.com/wp-content/uploads/2024/02/Rahul-Gandhi-promises-caste-census-removal-of-50-cap-on-reservation-if-INDIA-bloc-voted-to-powe-jpg.webp)
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటించబోతున్నారు. అసెంబ్లీ లో ఎలాగైతే విజయం సాధించారో..ఈ లోక్ సభ ఎన్నికల్లో కనీసం 14 సీట్లు కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తుంది. ఈ తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం తో జోరు చూస్తున్నారు. ఇక ఈరోజు రాహుల్ గాంధీ కూడా ప్రచారంలో పాల్గొనబోతున్నారు.
నర్సాపూర్, సరూర్నగర్లో నిర్వహించే ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొననున్నారు. సాయంత్రం 4.00 PM గంటలకు నర్సాపూర్, 6.00 PM గంటలకు సరూర్నగర్ స్టేడియంలో నిర్వహించే సభలకు హాజరుకానున్నారు. రాహుల్ గాంధీ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదిలాఉండగా.. ఏప్రిల్ 19న ప్రారంభమైన ఈ పార్లమెంటు ఎన్నికలు జూన్ 1 వరకు జరగనున్నాయి. ఇప్పటికే మూడు దశల్లో పోలింగ్ ముగియగా.. ఇంకా నాలుగు దశల్లో పోలింగ్ జరగాల్సి ఉంది. తెలంగాణలో మే 13న లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇక జూన్ 4న ఓట్ల లెక్కింపు ఉంటుంది.