125వ రోజుకు చేరిన రాహుల్‌ గాంధీ జోడో యాత్ర

జమ్ముకశ్మీర్‌లో కొనసాగుతున్న జోడో యాత్ర

rahul-gandhi -bharat-jodo-yatra-in-jammu-kashmir

శ్రీనగర్‌ః కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర జమ్ముకశ్మీర్‌లో కొనసాగుతున్నది. గతేడాది సెప్టెంబర్‌ 7న తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమైన పాదయాత్ర నేటితో 125వ రోజుకు చేరుకున్నది. శుక్రవారం ఉదయం జమ్ములోని కతువాలో రాహుల్‌ గాంధీ తన నడకను కొనసాగిస్తున్నారు. శివసేనకు (ఉద్ధవ్‌ థాక్రే వర్గం) చెందిన సీనియర్‌ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సంజయ్‌ రౌత్‌.. రాహుల్‌తో కలిసి నడుస్తున్నారు. కాగా, జమ్ముకశ్మీర్‌లో 10 రోజులపాటు కొనసాగి ఈ నెల 30తో యాత్ర ముగియనుంది.

కాగా, సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమైన ఈ యాత్ర 14 రాష్ట్రాల్లో కొనసాగింది. ప్రస్తుతం జమ్మూ కశ్మీర్ 14వ రాష్ట్రం. గురువారం సాయంత్రం పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ మీదుగా ఆయన జమ్ముకశ్మీర్‌లో ప్రవేశించారు. రాహుల్ గాంధీ ఇప్పటి వరకు 3,000 కిలోమీటర్లకు పైగానే నడిచారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/category/telangana/