తెలంగాణ లో మరో ఉద్యమకారుడు మృతి..

తెలంగాణ లో మరో ఉద్యమకారుడు కన్నుమూశారు. పది రోజుల క్రితం ప్రముఖ గాయకుడు, ఉద్యమకారుడు సాయిచంద్ గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈయన మరణం నుండి ఇంకా రాష్ట్ర ప్రజలు , ఉద్యమ కారులు తేరుకోకముందే మరో ఉద్యమనేత కన్నుమూయడం అందర్నీ కన్నీరు పెట్టిస్తుంది.

సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం బొప్పారం గ్రామానికి చెందిన ఉద్యమకారుడు పడగాల కృష్ణారెడ్డి రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో కృష్ణారెడ్డి తలకు తీవ్రంగా గాయం కావటంతో.. కృష్ణారెడ్డిని హైదరాబాద్‌కు తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం విషమం కావడం తో తుది శ్వాస విడిచారు.

కృష్ణారెడ్డి మరణించిన వార్త విని హుటాహుటిన వారి నివాసానికి వెళ్లిన మంత్రి జగదీష్ రెడ్డి.. ఆయన మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ క్రమంలోనే కృష్ణారెడ్డి పార్థివ దేహాన్ని చూసి మంత్రి కన్నీళ్లు పెట్టుకున్నారు. తన సహచర ఉద్యమకారుడైన కృష్ణారెడ్డి అకాల మరణం పార్టీకి, కుటుంబ సభ్యులకు తీరని లోటని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. మంత్రితో పాటు తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్, నల్గొండ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్రావు తదితరులు నివాళులర్పించారు.