రాజమండ్రిలో రఘురామ రాజుకు ఘన స్వాగతం

వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ రాజుకు రాజమండ్రి లో అభిమానులు ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి విమానంలో చేరుకున్న ఆయనకు… అభిమానులు గజమాలతో బ్రహ్మరథం పట్టారు. భారీ సంఖ్యలో ఎయిర్ పోర్టుకు అభిమానులు చేరుకోవడంతో అక్కడి వాతావరణం అంత సందడి గా మారింది. టీడీపీ, జనసేన కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. రఘురాజు అనుకూల నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తి పోయింది.

రాజమండ్రి నుంచి భీమవరంకు ఆచంట, పాలకొల్లు మీదుగా ఆయన భారీ ర్యాలీగా వెళ్తున్నారు. వందలాది కార్లు రఘురాజును అనుసరిస్తున్నాయి. నాలుగేళ్ల తర్వాత ఆయన స్వస్థలానికి వెళ్తుండటం గమనార్హం.