రహదారిపైనే ల్యాండ్ అయినా మోదీ

ఉత్తర్​ప్రదేశ్​లో పూర్వాంచల్ ఎక్స్​ప్రెస్​ వేను ప్రారంభించేందుకు ప్రధాని మోడీ సీ-130జే యుద్ధ విమానంలో వెళ్లారు. వినూత్నంగా మోడీ రహదారిపైనే ల్యాండ్ అయ్యారు. పూర్వాంచల్ ఎక్స్​ప్రెస్​ వే లఖ్​నవూను యూపీలోని తూర్పున ఉండే ప్రాంతాలను కలుపుతూ 340.8 కిలోమీటర్ల మేర నిర్మించారు. రూ.22,500 కోట్ల వ్యయంతో రహదారిని పూర్తి చేశారు.

ఆరు లేన్ల ఈ ఎక్స్​ప్రెస్ వే.. బారాబంకి, అమేఠీ, సుల్తాన్​పుర్, అయోధ్య, అంబేడ్కర్ నగర్, ఆజంగఢ్, మౌ, గాజీపుర్ జిల్లాలను కలుపుతుంది. రహదారిలో భాగంగా సుల్తాన్​పుర్ వద్ద 3.2 కిలోమీటర్ల ఎయిర్​స్ట్రిప్ సిద్ధం చేశారు. అత్యవసర సమయంలో యుద్ధ విమానాలు దిగేందుకు వీలుగా దీన్ని ఏర్పాటు చేశారు.వాహనదారులకు ప్రయోజనం కలిగేలా, ఇంధన వాడకం తగ్గేలా ఈ రహదారిని నిర్మించారు. భవిష్యత్​లో దీన్ని ఎనిమిది లైన్ల రహదారిగా మార్చుకోవచ్చు. మోదీ ఈ రహదారిని ప్రారంభించనున్న నేపథ్యంలో.. ముందస్తు ట్రయల్స్​లో భాగంగా ఎక్స్​ప్రెస్​వేపై మిరాజ్ 2000, సుఖోయ్-30, ఏఎన్32 టర్బోప్రాప్ యుద్ధవిమానాలతో పాటు సీ-130 రవాణా విమానం సైతం రహదారిపై ఆదివారం దింపారు.