పురందేశ్వరి, కిషన్ రెడ్డిలకు తెలుగు రాష్ట్రాల నాయకత్వ బాధ్యతలు

ఏపీ బిజెపి అధ్యక్షురాలిగా పురందేశ్వరి.. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి నియామకం

purandeswari-and-kishan-reddy-appointed-as-ap-and-telangana-bjp-presidents

హైదరాబాద్‌ః ఏపీ బిజెపి అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురందేశ్వరి నియమితులయ్యారు. సోము వీర్రాజును అధ్యక్ష పదవి నుంచి తొలగించిన పార్టీ హైకమాండ్ పురందేశ్వరికి రాష్ట్ర నాయకత్వ బాధ్యతలను అప్పగించింది. అధ్యక్ష పదవి రేసులో సత్యకుమార్, సుజనా చౌదరి పేర్లు వినిపించినప్పటికీ… చివరకు ఊహించని విధంగా ఆ పదవి పురందేశ్వరికి దక్కింది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా బండి సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డిని అధిష్ఠానం నియమించింది. పురందేశ్వరి, కిషన్ రెడ్డిలను తెలుగు రాష్ట్రాలను అధ్యక్షులుగా బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమించినట్టు అధికారికంగా ఉత్తర్వులు వెలువడ్డాయి.