తెలంగాణలో రేపు ప‌ల్స్ పోలియో కార్యక్రమం

హైదరాబాద్: పోలియో మహమ్మారి నుంచి పిల్లలను కాపాడేందుకు వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో రేపు తెలంగాణవ్యాప్తంగా పల్స్‌ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయనున్నారు. రాష్ట్రంలో 38 లక్షల మందికిపైగా పిల్లలకు చుకలు వేయాలని వైద్యారోగ్యశాఖ లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా హెల్త్‌ సెంటర్లు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, లైబ్రరీలు, బస్టాండ్లు, విమానాశ్రయం, పర్యాటక ప్రాంతాల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటలవరకు చుక్కలు వేయనున్నారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాల్లో మాత్రం రాత్రి 8 గంటల వరకు చుక్కలు వేయనున్నారు. ఆ తర్వాత రెండు రోజులపాటు సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహించి, చుక్కలు వేసుకోని వారిని గుర్తించి వేస్తారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొని వియజవంతం చేయాలని మంత్రి హరీశ్‌రావు కోరారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/