బిజెపి తీర్థం పుచ్చుకున్న ఆచార్య నటుడు..

తెలంగాణ రాష్ట్రంలో బిజెపి రోజు రోజుకు పుంజుకుంటుంది. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా కాషాయం జెండా ఎగురవేయాలని పక్క ప్రణాళికతో ముందుకు వెళ్తుంది. అందులో భాగంగా ఆకర్ష్ పేరుతో అందర్నీ రాబట్టుకునేపనిలో ఉంది. ఇప్పటికే పలు పార్టీల నుండి పెద్ద ఎత్తున బిజెపి లోకి చేరగా..మరికొంతమంది చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. కేవలం రాజకీయ నేతలే కాదు సినిమా ఇండస్ట్రీ వారు కూడా బిజెపి తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నారు.

తాజాగా ప్రముఖ నటుడు సంజయ్ రాయిచుర ఈటెల సమక్షంలో బీజేపీలో చేరారు. ఆచార్య , మహర్షి సినిమాలతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న సంజయ్..పలు దక్షిణ భారత సినిమాల్లో, సీరియల్స్ లలో కూడా నటిస్తూ మెప్పిస్తున్నారు. ప్రధాని మోడీ గారి విజన్, సమర్థవంతమైన నాయకత్వ లక్షణాల పట్ల ఆకర్షితుడినై బీజేపీ లో చేరుతున్నానని సంజయ్ తెలిపారు. సంజయ్ చేరిక బీజేపీ నీ మరింత బలోపేతం చేస్తుంది అని ఈటల రాజేందర్ తెలిపారు. సంజయ్ తో పాటు బిజెపిలో చేరిన వారిలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, కర్ణాటక మాజీ సిఎస్ రత్నప్రభ కూడా ఉన్నారు.

ఇక ఈ నెల 21 న మునుగోడు సభ లో మాజీ ఎమ్మెల్యే , కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ బిజెపి తీర్థం పుచ్చుకోబోతున్నారు. అలాగే అదే సభ లో టిఆర్ఎస్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు సైతం బిజెపి కండువా కప్పబోతున్నట్లు తెలుస్తుంది.