రేపు విశాఖలో పర్యటించనున్న సీఎం జగన్

మిలాన్-2022లో పాల్గొననున్న జగన్

అమరావతి: సీఎం జగన్ రేపు విశాఖలో పర్యటించనున్నారు. ‘మిలాన్-2022’ యుద్ధనౌకల సమాహారంలో భాగంగా నిర్వహించే ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.

జగన్ విశాఖ షెడ్యూల్ వివరాలు:

.ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఆయన విశాఖ చేరుకుంటారు.
.విమానాశ్రయం నుంచి నేవల్ డాక్ యార్డ్ కు వెళతారు.
.అక్కడ జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు.
.అనంతరం ఐఎన్ఎస్ వేలా సబ్ మెరైన్ ను సందర్శిస్తారు.
.ఆ తర్వాత ఏపీ ప్రభుత్వ సర్క్యూట్ హౌస్ కు వెళతారు.
.సాయంత్రం 5.30 గంటలకు ఆర్కే బీచ్ కు చేరుకుంటారు.
.ఆర్కే బీచ్ లో జరిగే ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ మిలాన్-2022లో పాల్గొని, ప్రసంగిస్తారు.
.రాత్రి 7.15 గంటలకు విశాఖ ఎయిర్ పోర్టు నుంచి తిరుగుపయనమవుతారు.

కాగా, సీఎం వైఎస్ జగన్ ఈ నెలలో విశాఖపట్నంలో పర్యటించడం ఇది మూడోసారి. ఈ నెల ప్రారంభంలో జరిగిన విశాఖ శారదాపీఠం వార్షికోత్సవ వేడుకలకు హాజరైన జగన్.. ఆ తర్వాత ఫ్లీట్ రివ్యూకు హాజరైన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు స్వాగతం పలికేందుకు వెళ్లారు. ఇప్పుడు మూడోసారి వైజాగ్‌లో పర్యటించనున్నారు. ఆదివారం విశాఖపట్నంలో జరిగే మిలన్-2022 కార్యక్రమానికి సీఎం జగన్ హాజరుకానున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/