మరోసారి ఢిల్లీకి సిఎం జగన్‌ ?

రేపు ఢిల్లీకి వెళ్లనున్న జగన్‌..అమిత్‌షాతో భేటి

CM Jagan
CM Jagan

అమరావతి: ఏపి సిఎం జగన్‌ రేపు మళ్లీ వెళ్లనున్నారు. రేపు సాయంత్రం హోంమంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ ఖరారు కావడంతో సిఎం జగన్‌ ఢిల్లీ టూర్ ఖరారైంది. నిన్న సాయంత్రం ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్రమోడితో సమావేశమైన సీఎం జగన్ ఆయనతో అనేక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. గంటన్నరపాటు సాగిన ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన అంశాలతో పాటు పలు రాజకీయ అంశాలపై కూడా సిఎం జగన్‌ ప్రధాని మోడికి వివరణ ఇచ్చారు. ఢిల్లీలోనే ఉండి హోంమంత్రి అమిత్ షాను జగన్ కలుస్తారని ప్రచారం జరిగింది. అయితే అమిత్ షా అపాయింట్ మెంట్ ఖరారు కాకపోవడంతో ఆయన విజయవాడకు తిరుగుపయనమయ్యారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/