30 ఇయర్స్ పృథ్వీరాజ్కు స్వల్ప అస్వస్థత
30 ఇయర్స్ పృథ్వీరాజ్ అనారోగ్యానికి గురై హాస్పటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. దీనికి సంబదించిన వీడియో ను ట్విట్టర్ ద్వారా షేర్ చేసాడు. ఆయన ఏ హాస్పిటల్లో చేరారు.. ఆయన అస్వస్థతకు కారణాలేంటి వంటి విషయాలు తెలియకపోయినా, ఆయన హాస్పిటల్లో బెడ్పై పడుకుని సెలైన్ ఎక్కించుకుంటున్న వీడియో మాత్రం బయటికి వచ్చింది. ఈ వీడియోలో ఆయన తన సినిమా గురించి వెల్లడించారు. హాస్పిటల్లో సెలైన్ ఎక్కించుకుంటున్నా తన ఆలోచన అంతా సినిమాపైనే అని ఆ వీడియోలో పృథ్వీ అన్నారు.
ప్రస్తుతం పృథ్వీరాజ్ దర్శకుడిగా మారి సొంత కూతురు శ్రీలును హీరోయిన్గా పెట్టి ‘కొత్త రంగుల ప్రపంచం’ అనే సినిమా చేశారు. ఈ సినిమా ద్వారా క్రాంతి హీరోగా పరిచయమవుతున్నారు. శ్రీ పీఆర్ మూవీస్ బ్యానర్పై పద్మ రేఖ, గుంటక శ్రీనివాస్ రెడ్డి, కుర్రి కృష్ణా రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు ఈ సినిమా సిద్ధంగా ఉంది.