కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై కవిత ట్వీట్
ఈ ఎన్నికల్లో ద్వేషాన్ని తిరస్కరించండి..! అభివృద్ధికి ఓటేయండి.. కర్ణాటక ఓటర్లకు కవిత పిలుపు
హైదరాబాద్ః బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై ట్వీట్ చేశారు. కర్ణాటక ప్రజలారా..! ఈ ఎన్నికల్లో ద్వేషాన్ని తిరస్కరించండి..! అభివృద్ధికి ఓటేయండి అని ఆమె పిలుపునిచ్చారు. ప్రజల, సమాజ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఓటేయాలని ఆమె తన ట్వీట్లో కోరారు. కర్ణాటకలోని 224 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే విడుతలో ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రస్తుతం పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఈ ఎన్నికల్లో 2,615 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక 5,31,33,054 మంది ఓటర్లు తమ ఓటు హక్కును ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తున్నారు.
సీఎం బసవరాజు బొమ్మై (బిజెపి) శింగావ్ నుంచి, మాజీ సీఎంలు సిద్ధరామయ్య(కాంగ్రెస్) వరుణ నుంచి, శెట్టర్ (కాంగ్రెస్) హుబ్బళ్లి-ధార్వాడ సెంట్రల్ నుంచి, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి (జేడీఎస్) చెన్నపట్టణ నుంచి బరిలో నిలిచారు. మే 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.