గవర్నర్ కోట కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు..?

గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ తమ అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతానికి గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరాం, విద్యాసంస్థల అధినేత జాఫర్ జావిద్ ను పేర్లు కాంగ్రెస్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. కోదండ రామ్ ను ఎమ్మెల్సీ చేయాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినట్లు తెలుస్తుంది. తెలంగాణ ఉద్యమంలో కోదండరాం పోషించిన పాత్ర గురించి చెప్పాల్సిన పనిలేదు. అందుకే ఆయన పేరును రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించి గవర్నర్ పంపే అవకాశం ఉందని సమాచారం.

రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ రాజకీయాలతో ముడిపెట్టకుండా ఉండేలా ప్రభుత్వం సూచించినట్లు తెలుస్తుంది. గత ప్రభుత్వంలో దాసో శ్రావణ్, కుర్ర సత్యనారాయణ విషయంలో గవర్నర్ భిన్నంగా స్పందించడంతో ఈసారి అలాంటి చేదు అనుభవం ఎదురు కాకుండా వ్యవహరించాలని ప్రభుత్వం భావిస్తుంది. మరో స్థానానికి జావిద్ జాఫర్ పేర్లు కాంగ్రెస్ పరిశీలిస్తుంది. రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తి కావడంతో విద్యారంగం తరపున ఆయనను ప్రతిపాదించాలనుకుంటుంది. దేనిపై త్వరలోనే అధికారిక ప్రకటన చేయాలనీ కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం.