నెల్లూరు జిల్లాలో కాలువలో బోల్తాపడిన ప్రైవేట్ స్కూల్ బస్సు

నెల్లూరు జిల్లాలో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. సుమారు 30 మంది సిబ్బంది తో నెల్లూరు నుంచి ఆత్మకూరు వైపు వెళుతూ టోల్ ప్లాజా రుసుము చెల్లించకుండా ఉండేందుకు అరవపాలేం సదరన్ ఛానల్ కాలువ మీదుగా వెళ్తుండగా అదుపుతప్పి కాలువలో బోల్తా పడింది.

కాలువలో నీరు తక్కువ గా ప్రవహిస్తుండడం తో ప్రాణ పాయం తప్పింది. ఈ ఘటనలో ఆరుగురికి స్వల్పగాయాలయ్యాయి. గాయపడిన వారిని బుచ్చి ప్రభుత్వ హాస్పటల్ కు తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి స్థానికులు బస్సులోని సిబ్బందిని కాపాడారు.