వెంకన్న సాక్షిగా పెళ్లి ఫై క్లారిటీ ఇచ్చిన ప్రభాస్

పాన్ ఇండియా స్టార్ , మోస్ట్ బ్యాచ్లర్ ప్రభాస్..తిరుమల వెంకన్న సాక్షిగా తన పెళ్లి ఫై క్లారిటీ ఇచ్చారు. ప్రభాస్ ప్రస్తుతం ఆదిపురుష్ మూవీ తో ఈ నెల 16 న భారీ ఎత్తున పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ అవుతుంది. ఇప్పటికే రిలీజ్ అయినా ఈ చిత్రం తాలూకా టీజర్ , ఫొటోస్ యావత్ అభిమానులను , ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. దీంతో సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలో ప్రమోషన్లో భాగంగా మంగళవారం తిరుపతి లో చిత్ర ప్రీ రిలీజ్ వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ వేదికపైనే చినజీయార్ స్వామీజీ ప్రభాస్ బృందానికి ఆశీస్సులు అందించారు. అయితే ఇదే వేదికపై ప్రభాస్ ని వ్యక్తిగతంగా ప్రశ్నిస్తూ పెళ్లెప్పుడు? అని అడిగాడు ఓ అభిమాని. దానికి వెంటనే సరదాగా స్పందిస్తూ `నేను తిరుపతి లో వివాహం చేసుకుంటాను“ అంటూ టీజ్ చేసారు.

అలాగే సినిమాల విషయానికి వస్తే..ఏడాదికి రెండు సినిమాలు చేస్తా..కుదిరితే సంవత్సరానికి మూడు సినిమాలు కూడా రావొచ్చు. అని తెలిపారు. ఇక ఆదిపురుష్ సినిమా కోసం టీమ్‌ మొత్తం రోజుకు దాదాపు 20 గంటలు కష్టపడ్డారు.. ఓం రావత్‌ ఓ యుద్ధమే చేశాడు.. నా జీవితంలో ఇలాంటి వ్యక్తిని చూడలేదు.. ఆదిపురుష్‌ చేయడం మా అదృష్టం అన్నారు ప్రభాస్‌.