ఈరోజు నుంచి బద్రీనాథ్ ఆలయం మూసివేత
న్యూఢిల్లీః ఉత్తరాఖండ్ లోని బద్రీనాథ్ ఆలయాన్ని శనివారం నుంచి అధికారులు మూసివేయనున్నారు. మధ్యాహ్నం 3.35 గంటల తర్వాత నుంచి స్వామి వారి దర్శనానికి భక్తులను అనుమతించరు. శీతాకాలం దృష్ట్యా తాత్కాలికంగా ఆలయాన్ని మూసివేస్తున్నట్లుగా దేవస్థానం మేనేజ్మెంట్ బోర్డు తెలిపింది. శీతాకాలంలో దాదాపు నాలుగు నెలలకి పైగా బద్రీనాథ్ ఆలయుం మంచుతో కప్పబడి ఉంటుంది. అందువల్ల భక్తులను అనుమతించరు. మళ్లీ మే నెలలో ఆలయాన్ని తిరిగి తెరుస్తారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/telangana/