చప్పట్లు చరిచి వైద్య సిబ్బందికి భారతావని అభినందన
ఇళ్ల ముందు నిలబడి చప్పట్లు
New Delhi/TS./AP: జనతా కర్ఫ్యూ లో భాగంగా సాయంత్రం సరిగ్గా 5 గంటలకు యావత్ భారతా వని తమ తమ ఇళ్ల ముందు నిలబడి చప్పట్టు చరుస్తూ కరోనా మహమ్మారితో పోరాడుతున్న వైద్యులకు, నర్సులకు అభినందనలు తెలిపింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు ప్రగతి భవన్ లో చప్పట్లు చరుస్తూ అభినందనలు తెలియజేశారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు, సామాన్యజనం మొత్తం యావత్ భారత్ మోడీ పిలుపునకు స్పందించి చప్పట్లు చరుస్తూ వైద్య బృందాలకు అభినందనలు తెలియజేస్తూ కరోనాపై పోరుకు తమ సంఘీభావాన్ని ప్రకటించారు.
తాజా కెరీర్ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/