కొల్హాపూర్ మ‌హాలక్ష్మి మాతా ఆల‌యంలో సిఎం కెసిఆర్‌ పూజ‌లు

ts-cm-kcr-prayers-at-mahalakshmi-temple-in-kolhapur

ముంబయిః మ‌హారాష్ట్ర‌లోని కొల్హాపూర్‌కు బిఆర్ఎస్ అధినేత‌, సిఎం కెసిఆర్‌ ఈరోజు మ‌ధ్యాహ్నాం చేరుకున్నారు. కెసిఆర్‌కు బిఆర్ఎస్ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అబ్ కీ బార్ కిసాన్ స‌ర్కార్, దేశ్ కీ నేత కెసిఆర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కొల్హాపూర్ నుంచి నేరుగా మ‌హాలక్ష్మి మాతా(అంబాబాయి) దేవాల‌యానికి చేరుకున్న సిఎం కెసిఆర్ అక్క‌డ ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా వేద పండితులు కెసిఆర్‌ను ఆశీర్వ‌దించి, తీర్థ ప్ర‌సాదాలు అంద‌జేశారు.

మ‌రికాసేప‌ట్లో సాంగ్లి జిల్లాలోని వాటేగావ్‌ గ్రామానికి చేరుకుంటారు. మహారాష్ట్ర యుగకవిగా, దళిత సాహిత్య చరిత్రలో ఆద్యుడిగా పేరొందిన అన్నాభావు సాఠే 103వ జయంతి వేడుకల్లో కెసిఆర్ పాల్గొంటారు. ఆయన విగ్రహానికి నివాళులర్పిస్తారు. అనంతరం అన్నభావు బంధువుల ఇంటికి వెళ్లనున్నారు. అక్కడ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత ఇస్లాపూర్‌లోని రఘునాథ్‌ దాదాపాటిల్‌ నివాసానికి చేరుకుంటారు. కొల్హాపూర్‌లోని సాధు మహారాజ్‌ సమాధి వద్ద నివాళి అర్పిస్తారు. నాగాల పార్క్‌లోని పూధరి న్యూస్‌పేపర్‌ యజమాని ఇంటికి వెళ్తారు. సాయంత్రం 5.40 గంటలకు కొల్హాపూర్‌ విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు తిరుగు పయనమవుతారు.