మూడ్రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్న ప్రధాని మోడీ
25న కరీంనగర్, 26న నిర్మల్, 27న హైదరాబాద్లో పర్యటన
హైదరాబాద్ః ప్రధాని నరేంద్రమోడీ నేడు సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరగనున్న మాదిగల విశ్వరూప మహసభకు ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల చివరలో వరుసగా మూడు రోజుల పాటు తెలంగాణలో ప్రయటించనున్నారు. రెండో విడత ప్రచారంలో భాగంగా ఈ నెల 25న కరీంనగర్, 26న నిర్మల్ బహిరంగ సభలలో పాల్గొంటారు. 27న హైదరాబాద్లో రోడ్డు షో నిర్వహించనున్నారు. ప్రధాని మోడీ షెడ్యూల్ ఖరారు కావడంతో బిజెపి తెలంగాణ నాయకత్వం సభలకు జన సమీకరణ చేసేందుకు సిద్ధమైంది. బిజెపి 119 నియోజకవర్గాలకు గాను 111 స్థానాల్లో పోటీ చేస్తోంది. జనసేనతో పొత్తు ఉండటంతో జనసేనకు ఎనిమిది సీట్లు కేటాయించింది.