కాశీలోని గంగా న‌దిలో ప్రధాని మోడీ పుణ్య స్నానం

YouTube video

వారణాసి: ప్ర‌ధాని మోడీ జ్యోతిర్లింగ క్షేత్రం కాశీలోని గంగా న‌దిలో పుణ్య స్నానం ఆచ‌రించారు. కాశీ విశ్వ‌నాథ్ కారిడార్‌ను జాతికి అంకితం చేసేందుకు కాశీలో ప‌ర్య‌టిస్తున్న ఆయ‌న ఇవాళ ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా.. గంగా న‌దిలో ఆయ‌న పుణ్య స్నానం చేశారు. ల‌లితా ఘాట్ వ‌ద్ద మోడీ జ‌ల‌త‌ర్ప‌ణం చేశారు. గంగా మాత‌కు పుష్పాలు అర్పించారు. సూర్య భ‌గ‌వానుడికి పూజ‌లు చేశారు. మంత్రోచ్ఛ‌ర‌ణ చేస్తూ గంగాదేవికి స‌మ‌ర్ప‌ణ చేశారు. కాషాయ వ‌స్త్రాల్లో.. గంగా జ‌లాన్ని తీసుకుని ఆయ‌న బాబా విశ్వ‌నాథుడి వ‌ద్ద‌కు వెళ్లారు. విశ్వ‌నాథుడికి ఆ జ‌లంతో అభిషేకం చేయ‌నున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/