సీఎం భగవంత్ మాన్కు ప్రధాని శుభాకాంక్షలు
పంజాబ్ అభివృద్ధికి కలిసి పనిచేద్దామని పిలుపు
న్యూఢిల్లీ: పంజాబ్ ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు భగవంత్ మాన్ ఈరోజు ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలోనే భగవంత్ మాన్కు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. పంజాబ్ అభివృద్దికి, రాష్ట్ర ప్రజల సంక్షేమానికి కలిసి పనిచేద్దామని ఈ సందర్భంగా భగవంత్కు మోడీ సూచించారు. కేంద్రం నుంచి పంజాబ్కు సహకారం లభిస్తుందని మోడీ అభినందనలు తెలుపుతూ ప్రధాని ట్వీట్ చేశారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/