తెలంగాణ సర్కార్ పై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శలు
హైదరాబాద్: బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ సర్కారుపై విమర్శలు గుపించారు. బంగారు తెలంగాణ చేస్తానని చెప్పిన సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని బాకీల తెలంగాణగా చేశారంటూ బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఈ విమర్శల్లో భాగంగా బుధవారం నాడు తెలంగాణ ప్రభుత్వ జమాఖర్చులపై కాగ్ విడుదల చేసిన నివేదికను ఆధారం చేసుకుని ప్రవీణ్ కుమార్.. కేసీఆర్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. తమ పార్టీ ప్రభుత్వం వస్తే ప్రతి పైసా లెక్కను ప్రజలను చూపిస్తామని ప్రకటించిన ఆయన.. ప్రజా ధనాన్ని దోచిన నాయకుల లెక్క కూడా తేలుస్తామంటూ హెచ్చరించారు. దోచిన డబ్బులను ముక్కు పిండి మరీ వసూలు చేసి రాష్ట్రంలో పాఠశాలలు, వైద్య శాలలు నిర్మిస్తామని ప్రవీణ్ తెలిపారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/