80 కొత్త బస్సులను ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి పొన్నం

Minister Ponnam Prabhakar Inaugurates 80 New RTC Buses

హైదరాబాద్‌ః తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ 80 కొత్త ఆర్టీసీ బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లో మహిళలు ఉచిత ప్రయాణం కల్పించారు…ఉచిత టికెట్ మీద ఇప్పటి వరకు 6 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేశారని తెలిపారు. 1050 కొత్త బస్సులు 400 కోట్లతో కొనుగోలు చేస్తున్నాం…ఖాకీ బట్టలతో ఉన్న ఆర్టీసి సిబ్బంది సంస్థను కాపాడుకుంటున్నారని తెలిపారు.

కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది…రాబోయే రోజుల్లో ఆర్టీసి బలోపేతానికి కృషి చేస్తామని ప్రకటించారు. సీసీఎస్ బకాయిలు దశల వారీగా విడుదల చేస్తామని… ప్రయాణికుల సంఖ్య పెరుగుతుంది కాబట్టి సిబ్బంది సంయమనంతో ఉండండన్నారు. ఆర్టీసిలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి అవన్నీ పరిష్కరించకుందాం… ఎన్ని ఇబ్బందులు వచ్చిన ఆర్టీసి ముందుకు తీసుకెళ్దాం, కాపాడు కుందామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.