సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: నేడు సీఎం కెసిఆర్ 68వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా టీఆర్ఎస్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు రాష్ట్రవ్యాప్తంగా బర్త్ డే వేడుక‌లు నిర్వహిస్తున్నారు. పలువురు రాజకీయ ప్రముఖులు సైతం సీఎం కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ కు ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ”తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన దీర్ఘాయుష్షుతో ఆరోగ్యంగా జీవించాలని ప్రార్థిస్తున్నాను.” అంటూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.

కాగా, గత కొద్ది రోజులుగా కేంద్రంలోని మోడీ సర్కార్ పై సీఎం కేసీఆర్ విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇటీవల ప్రధాని మోడీ హదరాబాద్ పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్ దూరంగా ఉన్నారు. అయితే, ఈ రోజు సీఎం కేసీఆర్ కు ప్రధాని మోడీ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపడం ఆసక్తి రేపింది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/