భోపాల్ సభలో కెసిఆర్ ను టార్గెట్ చేసిన మోడీ

కెసిఆర్ కూతురుకు మేలు చేయాలంటే బిఆర్ఎస్ కు ఓటు వేయాలన్న మోడీ

pm-modi

భోపాల్‌ః తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ నేరుగా విమర్శలు గుప్పించారు. కెసిఆర్ కూతురు కవితకు లాభం చేయాలనుకుంటే బిఆర్ఎస్ కు ఓటు వేయాలని, మీ కుటుంబ సభ్యులకు మంచి జరగాలంటే బిజెపికి ఓటు వేయాలని అన్నారు. ఈ ఏడాది చివరి నాటికి తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భోపాల్ లో నిర్వహించిన ఐదు రాష్ట్రాల బూత్ కమిటీల సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ.. కెసిఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేశారు. మరోవైపు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందంటూ విపక్షాలు విమర్శిస్తున్న తరుణంలో మోడీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.