ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ భేటి

pm-modi-chaired-cabinet-meet-ahead-of-budget-announcement

న్యూఢిల్లీః నేడు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చివరిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఈ ఉదయం 11.00 గంటలకు పార్లమెంటులో ఆమె బడ్జెట్ ప్రకటన చేయనున్న నేపథ్యంలో, కేంద్ర క్యాబినెట్ సమావేశమైంది.

ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన పార్లమెంటులో ఈ సమావేశం జరుగుతోంది. అటు, రాష్ట్రపతితో భేటీ అనంతరం నిర్మలా సీతారామన్ కూడా పార్లమెంటుకు వద్దకు వచ్చారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఇతర కేంద్రమంత్రులు అనురాగ్ ఠాకూర్, కిషన్ రెడ్డి తదితరులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో బడ్జెట్ పై సంక్షిప్తంగా చర్చించి ఆమోదం తెలుపనున్నారు.