బేగంపేట విమానాశ్రయం బహిరంగ సభలో ప్రధాని మోడి ప్రసంగం
హైదరాబాద్ః ఏపీ పర్యటన ముగించుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. తెలంగాణకు వచ్చారు. విశాఖ నుంచి నేరుగా బేగంపేట్ ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడ బిజెపి నాయకులు ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగింస్తున్నారు. అనంతరం అక్కడి నుంచి రామగుండం బయల్దేరి వెళ్తారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఇటు హైదరాబాద్లో.. అటు రామగుండంలో టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/