సస్పెండ్ కు గురైన నలుగురు ఎమ్మెల్యేల కటౌట్లను నిమజ్జనం చేసిన కార్యకర్తలు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారంటూ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి లను అధిష్టానం పార్టీ నుండి సస్పెండ్ కు గురి చేసిన సంగతి తెలిసిందే. సస్పెండ్ కు గురైన తర్వాత ఆ ఎమ్మెల్యేల ఫై కార్య కర్తలు , నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలు , ఆందోళన కార్యక్రమాలు చేస్తూ వస్తున్నా సంగతి తెలిసిందే. తాజాగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వెంకటగిరిలో వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి కటౌట్లను కైవల్య నదిలో నిమజ్జనం చేశారు. నల్ల జెండాలు చేతబట్టి వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అటు పలుచోట్ల ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. నలుగురు ఎమ్మెల్యేల దహనకాండ అంటూ.. వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో నెల్లూరు జిల్లా రాజకీయం రసవత్తరంగా మారింది.