ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డిని హెచ్చరించిన పవన్ కళ్యాణ్

కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. నీ రోజులు దగ్గర పడ్డాయి.. బలిసి కొట్టుకుంటున్నావు.. మీ నాయకునికి క్లిప్పింగ్స్‌ పంపించుకో.. నీ క్రిమినల్‌ ఎంపైర్‌నే నేలమట్టం చేస్తాం అంటూ ఓ రేంజ్ లో వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం పవన్ వారాహి విజయ యాత్ర పేరుతో యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నిన్న కాకినాడ లో సభ ఏర్పాటు చేశారు.

ఈ సభలో మాట్లాడుతూ ..జనవాణిలో ఎన్నో సమస్యలు బయటకు వచ్చాయి. స్థానిక ఎమ్మెల్యే గురించి ఎన్నో సమస్యలు వచ్చాయి. నాకు వ్యక్తిగతంగా ఎందుకుంటుంది. ఇటువంటి కోన్‌ కిస్కా గాళ్ల గురించి భయం ఉండదు.. అంటూ ఎమ్మెల్యే ద్వారంపూడిపై మండిపడ్డారు. కాకినాడ డీ గ్యాంగ్‌ దోపిడీ గురించి, వైస్సార్సీపీ క్రిమినల్స్‌ గురించి దేశం అంతా హ్యాష్‌ ట్యాగ్‌తో ట్రెండింగ్ చేయాలని పవన్‌ కళ్యాణ్‌ పిలుపునిచ్చారు. మగపిల్లలకు ధైర్యం లేకపోతే ఆడపిల్లలు చేయాలని సూచించారు.

కాపు రిజర్వేషన్‌ గురించి మాట్లాడాలంటే ప్రభుత్వం మారినప్పడుల్లా మారదని, కులాల్లోని యువతను వాడుకుని వారి భావోద్వేగాలను వాడుకుంటే ఆ నాయకుల వెంట ఉండకూడదని సూచించారు. తన డ్రైవర్ను చంపి ఇంటికి డోర్‌ డెలవరీ చేస్తే దళిత ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేస్తున్నారు..? మీకు కోపం రావడంలేదా.. అంటూ దళిత ప్రజాప్రతినిధులను ప్రశ్నించారు. బీసీ కులానికి చెందిన గౌడ బిడ్డను నిర్ధాక్షన్యంగా తోటల్లో చంపేస్తే బీసీ నాయకులు ఏం చేస్తున్నారు..? దానికి విలువ కట్టి లక్ష రూపాయలు ఓ బీసీ మంత్రి ఇస్తే లంగిపోవాలా అన్నారు.