అజిత్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో మల్టీస్టారర్..?
టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ కు , తమిళనాట అజిత్ ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. అలాంటి వీరిద్దరి కాంబోలో మల్టీస్టారర్ మూవీ రాబోతున్నట్లు ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓ పక్క సినిమాలు మరోపక్క రాజకీయాలతో బిజీ గా ఉన్న సంగతి తెల్సిందే. సుజిత్ డైరెక్షన్లో ప్రస్తుతం OG సినిమాతో పాటు హరీష్ శంకర్ డైరెక్షన్లో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు సెట్స్ ఫై ఉండగానే మరో మల్టీస్టారర్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఖుషి మూవీ ని డైరెక్ట్ చేసిన ఎస్ జె సూర్య డైరెక్షన్లో మల్టీస్టారర్ చిత్రానికి పవన్ ఓకే చెప్పాడట. పవన్ కెరియర్ లోనే సూపర్ హిట్టుగా నిలిచిన ఖుషి సినిమాకి దర్శకత్వం వహించింది ఎస్ జే సూర్యనే. ఆ తర్వాత వీరి కాంబోలో కోమరం పులి వచ్చింది. కానీ ఈ మూవీ ప్లాప్ అయ్యింది. ఆ తర్వాత వీరి కాంబో మూవీ అనేది బయటకు రాలేదు. తాజాగా ఇప్పుడు ఈ వార్త రావడం తో ఆసక్తిగా మారింది. సూర్య తమిళంలో ఎందరో స్టార్ హీరోలతో సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అయితే అజిత్ కుమార్ తో మాత్రం సూర్య సినిమాలు చేయలేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు తాను అజిత్తో సినిమా తీయాల్సి వస్తే… అజిత్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో ఓ మల్టీస్టారర్ సినిమా చేయాలనుకుంటున్నట్లు ఇటీవల తెలిపారు. ఒకవేళ సూర్య మళ్లీ మెగాఫోన్ పట్టి అజిత్, పవన్ కాంబోలో మాసివ్ మల్టీస్టారర్ తెరకెక్కిస్తే రికార్డులు నెక్ట్స్ లెవల్లో ఉంటాయని ఫ్యాన్స్ అంటున్నారు. మరి నిజంగా వీరి కాంబో లో మూవీ సెట్ అవుతుందా అనేది చూడాలి.