నేడు ఢిల్లీ వెళ్లనున్న జనసేన అధినేత
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో బిజెపితో కలిసి పోటీ చేసే అంశంపై నిశితంగా చర్చించేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా బిజెపి పెద్దలను పవన్ కళ్యాణ్ కవలవనున్నారు. మరీ ముఖ్యంగా బిజెపి అధ్యక్షుడు, జేపీ నడ్డా, కేంద్ర మంత్రి అమిత్ షాతో ఆయన భేటీ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల పంపకాలు, ఎవర్ని ఎక్కడ్నుంచి పోటీ చేయించాలి.? అనే విషయాలపై ఇవాళ సాయంత్రం ఓ క్లారిటీ వచ్చే అవకాశముంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/