రేపటి నుండి నాల్గు రోజుల పాటు ఏపీలో పవన్ బిజీ బిజీ

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాల్గు రోజుల పాటు ఏపీలో బిజీ బిజీ గా గడపనున్నారు. శనివారం హైదరాబాద్ నుండి నేరుగా విజయవాడ కు చేరుకోనున్నారు. మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పలు ముఖ్య సమావేశాలు, సమీక్షల్లో పాల్గొంటారు. ఆ తర్వాత బీసీ సంక్షేమంపై రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొననున్నారు. ఆదివారం ఉదయం 11గం.లకు పార్టీ రాష్ట్ర నాయకులతో సమీక్ష. పార్టీలో చేరికలు ఉండనుండగా, అదే రోజు మధ్యాహ్నం 2 గం.లకు మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య నేతృత్వంలోని కాపు సంక్షేమ సేన ప్రతినిధులతో భేటీ కానున్నారు.

13 వ తారీఖు ఉదయం 11గం.లకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాల నిర్వహణపై సమీక్ష, సాయంత్రం 5 గం. లకు గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ తో మర్యాదపూర్వక భేటీ, 14 వ తారీఖు మధ్యాహ్నం 1 గం.లకు మంగళగిరి పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి వారాహి తో మచిలీపట్నం సభకు బయలుదేరనున్నారు. ఇక సాయంత్రం 5గం.లకు మచిలీపట్నం సభా ప్రాంగణానికి చేరుకునీ బహిరంగ సభలో పాల్గొననున్నారు.