టీడీపీ తో పొత్తు ఫై పవన్ మరోసారి క్లారిటీ

రాబోయే ఎన్నికల్లో టీడీపీ తో పొత్తు ఫై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. గురువారం శ్రీకాకుళం జిల్లా రణస్థలం వేదికగా జరిగిన జనసేన యువశక్తి సభలో పవన్ కళ్యాణ్ యువతను ఉద్దేశించి పలు విషయాలను చెప్పుకొచ్చారు. అలాగే టీడీపీ తో పొత్తు ఫై కూడా క్లారిటీ ఇచ్చారు.

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని ఎందుకు అన్నానంటే.. 53 నియోజకవర్గాల్లో వైస్సార్సీపీ సాంకేతికంగా గెలిచింది. ఇటీవల చంద్రబాబుతో సమావేశమైతే కొందరు పిచ్చికూతలు కూస్తున్నారు. బేరాలు కుదిరాయని పిచ్చి వాగుడు వాగుతున్నారు. నేను అలాంటిని వ్యక్తిని కాదు. రూ. 25 కోట్లు ట్యాక్స్‌ కట్టే వ్యక్తిని నేను. చంద్రబాబు, పవన్‌ రెండున్నర గంటలు ఏం మాట్లాడారని గొంతు చించుకుంటున్నారు. సంబరాల రాంబాబు గురించి 22 నిమిషాలు, పనికిమాలిన ఐటీ మంత్రి రాష్ట్రాన్ని 15వ స్థానంలోకి నెట్టేశాడేంటని 18 నిమిషాలు. లాం అండ్‌ ఆర్డర్‌ ఎందుకు చితికిపోయింది, ఏం చేయాలి అని 38 నిమిషాలు మాట్లాడుకున్నాం. మాట్లాడే కొద్దీ కేసులు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తు ఎలా ఉండాలి అని గంటన్నర సేపు మాట్లాడుకున్నాం అని పవన్ చెప్పుకొచ్చారు.

వైస్సార్సీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని , కానీ, దాని వెనుక నేను కోరుకుంటున్నది స్టెబిలిటీ ఆఫ్‌ స్టేట్‌. వైస్సార్సీపీ అద్భుతమైన పాలన అందించి ఉంటే నేను గొంతెత్తే వాడిని కాదు. కానీ బాధిస్తా ఉంటే ఎదురు తిరుగుతాం. చంద్రబాబు తో భేటీ అయినప్పుడు సీట్ల గురించి నేను మాట్లాడలేదని పవన్ క్లారిటీ ఇచ్చారు. రాజకీయాల్లో వ్యూహం ఉండాలి. ఒంటరిగా వెళ్లి వీర మరణం పొందాల్సిన అవసరం లేదు. ఒంటరిగా ఉండి గెలిచే పరిస్థితి ఉంటే ఎవరితోనూ పొత్తు పెట్టుకునేది లేదు. జన సైనికులు ఆ భరోసా నాకు ఇస్తారా? నియంతను కలిసికట్టుగా ఎదుర్కోవాలి. కానీ, ఇక్కడ ఓ షరతు ఉంది. గౌరవం తగ్గకుండా.. కుదిరితే పొత్తుకు వెళ్తాం.. లేదంటే ఒంటరిగానే పోటీ చేస్తాం. రాజకీయాల్లో దశాబ్దం పాటు ఒంటరిగానే పోరాడా. వస్తే జనసేన ప్రభుత్వం.. లేదంటే మిశ్రమ ప్రభుత్వం. ఇది తథ్యం! అని పొత్తు ఫై ఫుల్ క్లారిటీ ఇచ్చారు.