ఉత్తరాఖండ్లో కారుపై కొండచరియలు విరిగిపడి ఏడుగురు మృతి
ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం జరిగింది. పితోర్గఢ్లో కారుపై కొండచరియలు విరిగిపడి ఏడుగురు మృతి చెందారు. కైలాష్-మానసరోవర్ మార్గంలో కారు వెళ్తుండగా ప్రమాదవశాత్తు కొండచరియలు విరిగిపడి కారు ఫై పడ్డాయి. దీంతో కారులో ప్రయాణం చేస్తున్న ఏడుగురు మృతి చెందారు. దాదాపు 24 గంటల తర్వాత సోమవారం శిథిలాల నుండి ఏడుగురి మృతదేహాలను బయటకు తీసినట్లు అధికారులు తెలిపారు. అందులో ముగ్గురు చిన్నారులు, ఇద్దరు పురుషులు, ఒక మహిళ మృతదేహాన్ని గుర్తించినట్లు వారు తెలిపారు.
ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. మృతులు గుంజి నుండి ధార్చులకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పితోర్గఢ్ ADM శివ్ కుమార్ బరన్వాల్ తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు. మృతులు కోపిల (13), కాశీష్ (10), నితిన్ (5), తుల రాం (62), ఆశాదేవి (56), డ్రైవర్ కిషన్గా గుర్తించారు. వీరంతా బలుకోట్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.