హుజూరాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల
కేంద్రం వద్ద 144 సెక్షన్, రెండు అంచెల భద్రత
హైదరాబాద్ : హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికకు ఇటీవలే షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. దాని ప్రకారం ఈ రోజు ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైంది. నేటి నుంచి నామినేషన్లు స్వీకరిస్తామని హుజూరాబాద్ ఆర్డీఓ రవీందర్ రెడ్డి వివరించారు. నామినేషన్ కేంద్రంలో కరోనా నిబంధనలు అమల్లో ఉంటాయని చెప్పారు. లోపలికి నామినేషన్ వేసే అభ్యర్థితో పాటు ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు.
ఆ కేంద్రం వద్ద 144 సెక్షన్, రెండు అంచెల భద్రత ఏర్పాటు చేశారని వివరించారు. నేటి ఉదయం 11 నుంచి 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ అక్టోబర్ 8. అక్టోబర్ 11న నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 13. ఈ నెల 30వ తేదీన పోలింగ్, నవంబర్ 2న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/