నూతన రాష్ట్రపతికి విపక్షాలు లేఖ..
నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విపక్షాలు లేఖ రాసారు. ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని లేఖలో పేర్కొన్నారు. రాజకీయ ప్రత్యర్థులపై ఈడీ, సీబీఐలను ఉసిగొల్పుతొందని ఆరోపణలు చేశారు. నిత్యవసర సరుకులపై జీఎస్టీ విధించటoపై పార్లమెంట్ లో చర్చకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని విపక్ష పార్టీల నేతలు అన్నారు. ప్రజా సమస్యలపై చర్చించకుండా కేంద్రం ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుందని లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు ఆయా పార్టీల ఎంపీల సంతకాలతో కూడిన లేఖను మంగళవారం విడుదల చేశాయి. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును విపక్షాలు కోరాయి.
ఇదిలా ఉంటె సోమవారం పార్లమెంట్ సెంట్రల్ హాల్లో నూతన రాష్ట్రపతి ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ద్రౌపది ముర్ము 15వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.. ద్రౌపది ముర్ము చేత ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం ముర్ము జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. అత్యున్నత పదవికి ఎన్నిక చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఉత్సవాల వేళ రాష్ట్రపతిగా ఎన్నిక కావడం సంతోషంగా ఉందన్నారు.