ఆన్లైన్ పాఠాలు
పిల్లలున్న ఇళ్లల్లో ఇదే తంతు
చిన్నారుల విద్య- పేరెంట్స్ బాధ్యత

పిల్లలకు ప్రస్తుతం ఆన్లైన్ పాఠాలు నడుస్తున్నాయి. ఇంటిపట్టునే ఉండి పాఠాలు వినే సౌకర్యం ఉన్నా, విద్యార్థులు, ఆందోళన, ఒత్తిడి వంటి మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొన్నది.
ఈ స్థితి నుండి పిల్లలను తల్లిదండ్రులు కాపాడుకోవాలి.
క్లాసులో కూర్నుఇ బుద్దిగా, శ్రద్ధగా పాఠాలు వినేవారు. ఇప్పుడేమో కంప్యూటర్ స్క్రీన్లను చూస్తూ ఆన్లైన్ పాఠాలు వినే పరిస్థితి నెలకొంది.
విద్యావిధానంలో హఠాత్తుగా చోటుచేసుకున్న ఈ విధానం విద్యార్థులు జీర్ణించుకుని అందుకు తగ్గట్లు సర్దుకుపోవడం కొంత కష్టమే.
పిల్లలు విపరీమైన ఒత్తిడికి లోనయ్యేలా చేస్తున్నాయి.

ఫలితంగా అకారణంగా కోపం తెచ్చుకోవడం, చికాకు పడుతూ ఉండడం, విసుక్కోవడం, కుంగిపోవడం లాంటి భావోద్వేగాలను తల్లిదండ్రులు పిల్లల్లో గమనిస్తూ ఉండాలి.
పరిస్థితికి కంగారుపడకుండా ఒత్తిడి లేని ఆన్లైన్ విద్యావిధానానికి అలవాటు పడేలా పిల్లలకు తోడ్పాటు అందించాలి.
అలవాటు లేని ఆన్లైన్ తరగతులు ఆసక్తిని రేకిత్తించలేవు. అప్పుడపుపడూ తలెత్తే సాంకేతిక లోపాలు ఆన్లైన్ పాఠాలకు అడ్డుతగులుతూ పిల్లలకు చికాకు తెప్పిస్తూ ఉంటాయి.
కాబట్టి పిల్లలు ఎదుర్కొంటున్న ఇలాంట ఇబ్బందులను సహృదయంతో అర్ధం చేసుకుని, వారితో ప్రేమగా మెలగాలి.
విద్యా సంవత్సరం నష్టపోకుండా అందుబాటులోకి వచ్చిన ఆన్లైన్ ప్రత్యామ్నాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అందరు పిల్లలతో సమానంగా ఆన్లైన్ తరగతులకు అలవాటు పడాలని సున్నితంగా నచ్చచెప్పాలి.

తరగతుల మధ్య విరామం ఉన్నా, ఏకాగ్రత కోల్పోతారనే భయంతో కంప్యూటర్ల ముందు పిల్లలను బలవంతంగా కూర్చోబెట్టడం చేయకూడదు.
విరామ సమయాల్లో వారికి నచ్చిన పనిచేయనివ్వాలి.బడిలో, కాలేజీలో తరగతులకు ఒక క్రమపద్ధతి, వాటి మధ్య విరామం ఉన్నట్లే, ఇంట్లో హాజరయ్యే తరగతులకు ఉండాలి.
మరీ ముఖ్యంగా మధ్యాహ్న భోజన విరామంలో లేచి ఇల్లంతా నడిచి తిరిగేలా పిల్లలను ప్రోత్సహించాలి. ఇలా ఉనన చోటి నుంచి కదలడం వల్ల పిల్లల్లో కొత్త హుషారు చోటు చేసుకుంటుంది.
పిల్లల్లో చెలరేగే మనోభావాలు మీతో పంచుకునేలా చేయాలి. ఒత్తిడిని పిల్లలు వ్యక్తపరిచే తీరు భిన్నంగా ఉంటుంది. అందుకు తల్లిదండ్రులు సిద్ధంగా ఉండాలి.
వాళ్లు స్వేచ్ఛగా, మనసులోని భావోద్వేగాలు వ్యక్తం చేసే వాతావరణం కల్పించాలి. వారి అభిప్రాయాలను అర్ధం చేసుకుని తగిన విధంగా స్పందించాలి.
ఇంట్లో పాఠాలు వింటున్నంత మాత్రాన ఇల్లు బడి లాంటిదే అనే భావన వారికి కలిగేలా చేయకూడదు. బడిలో లాగా ఆరు నుంచి ఏడు గంటలపాటు పాఠాలు చెప్పకూడదు
. రోజు మొత్తంలో రెండు నుంచి నాలుగు గంటల పాటు మాత్రమే బడి గంటలు కేటాయిస్తే సరిపోతుంది.
మిగతా సమయాల్లో పిల్లలను ఆడుకోనివ్వాలి. బడిలో, కాలేజీలో ఉన్నప్పుడు తోటి స్నేహితులతో కాలక్షేపం చేయడం ద్వారా, చదువు ఒత్తిడి పిల్లల్లో ఎప్పటికప్పుడు తగ్గిపోతుంది.
కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.
ఆన్లైన్ పాఠాలతో సమానంగా స్నేహితులను కలిసేలా వీలు కలిపంచాలి. అందుకు వీడియో ఛాట్ ద్వారా వారి స్నేహితులతో కబుర్లు చెప్పుకోనివ్వాలి.
అలా చేయడం ద్వారా పిల్లలు స్నేహితులను ప్రత్యక్షంగా కలిసిన అనుభూతికి లోనవుతారు. కాబట్టి వాళ్లను మిస్ అవుతున్నామనే భావన పిల్లలకు ఉండదు.

పిల్లలను అనుబంధాలను బలపరిచే వ్యాపకాల్లో భాగస్వాములను చేయాలి.
సాధ్యమైనంతవరకు పిల్లల మనసు తెలుసుకుని మసలుకుంటూ ఉండాలి. వారిలో చెలరేగే భావోద్వేగాలను కనిపెడుతూ, మృదువైన ధోరణితో ఆన్లైన్ విద్యావిధానానికి అలవాటు పడేలా ప్రోత్సహించాలి.
మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే కంటినిండా నిద్ర, పోషకాలు నిండిన ఆహారం, మానసికోల్లాసం సమతులంగా ఉండాలి.
కాబట్టి క్రమబద్ధమైన జీవనశైలికి పిల్లలను అలవాటు చేయాలి. వారి ఆన్లైన్ పాఠాల షెడ్యూల్కు తగ్గట్లుగా భోజనం నిద్రవేళ ప్రణాళిక రూపొందించాలి.
ఆ ప్రణాళికకు తగినట్లుగా పిల్లలు నడుచుకునేలా చూడాలి.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/