ఎన్కౌంటర్లో ఉగ్రవాది హతం
భారీగా ఆయుధాలు స్వాధీనం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామాలోని అవంతిపురాలో భారత భద్రతా బలగాలకు, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఓ ఉగ్రవాది మరణించారు. అవంతిపురా ప్రాంతంలో భారత భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం గాలిస్తుండగా ఈ ఎదురుకాల్పుల ఘటన జరిగింది. ఉగ్రవాది మరణించిన ప్రాంతంలో జవాన్లు ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
- తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/