ఒడిశా రైలు ప్రమాదం.. బెంగాల్ బాధితులకు రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం

west-bengal-government-announces-a-compensation-of-rs-5-lakhs

బాలాసోర్: ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాద ఘటనపై పశ్చిమబెంగాల్‌ సిఎం మమతా బెనర్జీ స్పందించారు. రైలు ప్రమాదంలో మరణించిన రాష్ట్రానికి చెందిన వారి కుటుంబాలకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తరుపున ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. తీవ్ర గాయాలపాలైన వారికి ఒక్కొక్కరికి రూ. 1 లక్ష, స్వల్పంగా గాయపడిన వారికి రూ. 50 వేలను ప్రకటించారు. ఈ విషయాన్ని పశ్చిమ బెంగాల్ సీఎంఓ ట్వీ్ట్ చేసింది.

కాగా, ఈ ప్రమాదంలో బెంగాల్ కు చెందిన ప్రయాణికులే ఎక్కువ మంది ఉన్నారు. ఈ ఘటన వెనుక కుట్రకోణం ఉండవచ్చునని సీఎం మమతా బెనర్జీ అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కేంద్రం దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. అయితే, ఇది రాజకీయాలు చేసే సమయం కాదని ఈ ఘటన ఎలా జరిగిందో తెలుసుకుని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన తరుణమని అన్నారు మమత. హెలికాప్టర్ ద్వారా ఒడిశాకు చేరుకున్న మమతా బెనర్జీ … కటక్ లోని ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు.