నారాయణ కాలేజ్ పెట్రోల్ ఘటనలో ఒకరు మృతి..

అంబర్ పేటలోని నారాయణ కాలేజీలో ఓ విద్యార్థి సంఘం నాయకుడు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన తెలిసిందే. ఈ ఘటన లో ఒక వ్యక్తి మృతి చెందారు. 15 రోజుల క్రితం అంబర్ పేట నారాయణ కాలేజీలో విద్యార్థి సందీప్ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాడు. అతనిని అడ్డుకునే క్రమంలో ప్రిన్సిపల్, ఏవో అశోక్ రెడ్డికి తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స పొందుతూ అశోక్ రెడ్డి మరణించాడు. విద్యార్థి సందీప్ పరిస్థితి విషమంగా ఉంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే..రామంతపూర్ కు చెందిన విద్యార్థి సాయి నారాయణ అంబర్పేట నారాయణ కాలేజీలో ఇంటర్ పూర్తి చేశాడు. ఎంసెట్ కౌన్సిలింగ్ ఉండటంతో టీసీ కోసం కాలేజీ కి వెళ్ళాడు. ఫీజు బాకీ ఉండడంతో కాలేజీ యాజమాన్యం టీసీ ఇవ్వకుండా ఇబ్బందికి గురిచేస్తున్నారు. దీంతో స్టూడెంట్ యూనియన్ లీడర్లతో కలిసి కాలేజీ వద్దకు వెళ్లారు. టీసీ విషయంలో ప్రిన్సిపల్ ఆశోక్ రెడ్డికి విద్యార్థి సంఘం నాయకుడు సందీప్ కు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో విద్యార్థి సంఘం నాయకుడు వెంట తెచ్చుకున్న పెట్రోల్ పోసుకుని భయపెట్టే ప్రయత్నం చేయగా ప్రమాదవశాత్తూ మంటలు అంటున్నాయి. ఈ ఘటనలో స్టూడెంట్ యూనియన్ లీడర్ సందీప్, విద్యార్థి వెంకటాచారితో పాటు ప్రిన్సిపల్ అశోక్ రెడ్డితో పాటు ఏఓకు గాయాలయ్యాయి. 15 రోజులుగా చికిత్స తీసుకుంటూ వస్తుండగా..ఈరోజు ప్రిన్సిపల్ అశోక్ రెడ్డి కన్నుమూశారు.