తమ్మినేని కృష్ణయ్య కుటుంబ సభ్యులను పరామర్శించబోతున్న బండి సంజయ్

TBJP Chief Bandi Sanjay

టిఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరుడు తమ్మినేని కృష్ణయ్య దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆగస్టు 15 న బైక్ పై వెళ్తున్న ఆయనను దండగులు కిరాతకంగా పొడిచి చంపారు. ఈ కేసులో ప్రధాన అనుచరులతో పాటు పలువుర్ని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. కాగా ఈ నెల 10 న బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తెల్దారుపల్లిలో తమ్మినేని కృష్ణయ్య కుటుంబ సభ్యులను పరామర్శించబోతున్నారు. ఈ విషయాన్నీ ఖమ్మం బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ తెలిపారు.

ఇదిలా ఉంటె తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో ప్రధాన నిందితుడు తమ్మినేని కోటేశ్వరరావు తో పాటు ఎల్లంపల్లి నాగయ్య ఖమ్మం కోర్టులో లొంగిపోయారు. కృష్ణయ్య హత్య జరిగినప్పటినుంచి వారిద్దరు పరారీలో ఉన్నారు. ఇక ఇప్పుడే వారే కోర్ట్ లో లొంగిపోయారు. ఇప్పటి వరకు ఈ కేసులో రంజన్‌ , గంజిస్వామి , లింగయ్య, బోడపట్ల శ్రీను, నాగేశ్వరరావు లు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.