ఏపీలో మరో ఏడుగురికి ఒమిక్రాన్ నిర్ధారణ

అమరావతి : ఏపీలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. తాజగా రాష్ట్రంలో ఏడుగురికి ఒమిక్రాన్ వేరియంట్ నిర్ధారణ అయింది. కొత్త కేసులతో కలిపి ఏపీలో ఇప్పటివరకు నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 24కి పెరిగింది. ఒమిక్రాన్ బాధితుల్లో ఒకరు ఓ మోస్తరు లక్షణాలతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. మిగతా వారి పరిస్థితి సాధారణంగానే ఉన్నట్టు తెలిపింది.

ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చిన వారిలో ఇద్దరు ఒమన్ నుంచి, ఇద్దరు యూఏఈ నుంచి వచ్చారు. కృష్ణా జిల్లాలో తొలిసారిగా మూడు ఓమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. అమెరికా నుంచి ఒకరు, దక్షిణ సూడాన్ నుంచి ఒకరు, గోవా నుంచి ఒకరు రాష్ట్రానికి వచ్చిన వారికి ఒమిక్రాన్ పాజిటివ్ నిర్ధారణ అయింది. తూర్పు గోదావరిలో ఒమిక్రాన్ వ్యాధి సోకిన వారిలో ఒకరు ఒమన్ తిరిగి వచ్చిన వ్యక్తి కాగా, మరొకరు UAE నుంచి తిరిగి వచ్చారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/